Friday, April 19, 2024

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 11 మంది మృతి..22 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్‌లోని బర్మేర్ జిల్లాలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందగా మరో 22 మంది గాయపడ్డారు. బర్మేర్-జోధ్‌పూర్ జాతీయ రహదారిపై భందియావాస్ గ్రామ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ట్రక్కు, బస్సు ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పది మంది అక్కడికక్కడే మరణించగా మరో వ్యక్తి ఆసుపత్రిలో మరణించినట్లు వారు చెప్పారు. గాయపడిన 22 మందిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని చికిత్స నిమిత్తం జోధ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు బర్మేర్ ఎస్‌పి దీపక్ భార్గవ్ తెలిపారు. రెండు వాహనాలకు మంటలు వ్యాపించడంతో వాటిని ఆర్పడానికి అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకున్నాయి. బస్సు ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్నట్లు అందులో ప్రయాణిస్తున్న షారూఖ్ అనే ప్రయాణికుడు జోధ్‌పూర్‌లో విలేకరులకు తెలిపారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బర్మేర్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందచేయాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News