Wednesday, April 24, 2024

పాకిస్తాన్‌లో బస్సు ప్రమాదం: 15 మంది మృతి.. 35 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

15 killed in bus accident in Pakistan

 

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో వేగంగా వెళుతున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 15 మంది ప్రయాణికులు మరణించగా మరో 35 మందికి పైగా గాయపడ్డారు. 50 మందికి పైగా ప్రయాణికులతో బస్సు లాహోర్ నుంచి ఖైబర్-పఖ్తున్‌ఖ్వా ప్రావిన్సులోని మర్దాన్‌కు వెళుతుండగా ఈ దుర్ఘటన సంభవించింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయిన బస్సు డ్రైవర్ బస్సును అదుపుచేయలేకపోవడంతో లోయలో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. అటోక్ జిల్లాలోని హసన్ అబ్దల్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News