కోల్కతా : పశ్చిమబెంగాల్లో డిఆర్ఐ అధికారులు గురువారం ఉదయం విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా ఎయిర్పోర్టు నుంచి అక్రమంగా తరలిస్తున్న 20.49 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ఈ బంగారం విలువ సుమారు రూ.3.3కోట్లు ఉంటుందని సిలిగురి డిఆర్ఐ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేశామని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు వారు వెల్లడించారు.