ఐపిఎల్ లాభాలతోనే హెచ్సిఎ ముందుకు
రికార్డుల్లో పేరు లేదనే అజహర్ను రానివ్వలేదు
హెచ్సిఎ అధ్యక్షుడు గడ్డం వివేక్
ముగిసిన అంబుడ్స్మన్ భేటీ
హైదరాబాద్: ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్ల ద్వారా వచ్చిన లాభాలతోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సిఎ)ను నడిపిస్తున్నాం. ఇప్పటివరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు’ అని హెచ్సిఎ అధ్యక్షుడు గడ్డం వివేక్ చెప్పారు. మంగళవారం హెచ్సిఎ కార్యాలయంలో అంబుడ్స్మన్ సమావేశం జరిగింది. ఈ సమావేశం అజెండాలో సెక్రటరీ శేష్ నారాయణపై వేటు, భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్కు అవమానం వంటి విషయాలపై వివేక్ మీడియాతో మాట్లాడారు. హెచ్సిఎ కార్యదర్శి శేష్ నారాయణపై పాలక మండలి విధించిన సస్పెన్షన్ను అం బుడ్స్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి నిర్దారిస్తారని, సస్పెన్షన్పై తీర్పు జనవరి 20కి వాయిదా పడినట్లు పేర్కొన్నారు. శేష్ నారాయణ తనకు మంచి మిత్రుడని, ప్రతిరోజూ రాత్రి ఫో న్ చేసి మాట్లాడుతాడని ఈ సందర్భంగా వివేక్ చెప్పారు.
కార్డు చూపించనందుకే రానివ్వలేదు
భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ను హెచ్సిపి కార్యాలయంలోకి రానీయకుండా అడ్డుకున్న వ్యవహారంపై వివేక్ వివరణ ఇచ్చారు. ‘నేషనల్ క్రికెట్ క్లబ్ కార్డు చూపించమని అడిగితే అజహర్ చూపించలేదు. ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉ న్నట్లు కనీసం రికార్డుల్లో కూడా లేదు. అందుకే అతడిని స మావేశానికి అనుమతించలేదు. అయితే అజహర్ సేవలను వినియోగించుకునేందుకు మేం ఎప్పుడూ సిద్ధంగానే ఉం టాం. క్రికెట్లో సమస్యలు చెప్పాలని ఆయనను కో రాం’ అని వివేక్ చెప్పుకొచ్చారు. ‘క్రికెట్లో ఎ, బి, సి, డిలు కూడా తెలియని వ్యక్తులు హెచ్సిఎకు ప్రెసిడెంట్గా ఉన్నారు’ అని వివేక్పై అజార్ మండిపడిన సంగతి తెలిసిందే.
టిసిఎతో విబేధాల్లేవు..
బిసిసిఐ నుంచి హెచ్సిఎకు నిధులు రాలేదని, ఐపిఎల్ మ్యాచ్ల ద్వారా వచ్చిన లాభాలతోనే నడిపిస్తున్నట్లు పునరుద్ఘటించిన వివేక్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టిసిఎ)తో హెచ్సిఎకు ఎలాంటి విబేధాల్లేవని స్పష్టం చేశారు. క్రికెట్ను ఎవరైనా నడిపించుకోవచ్చని, అయితే హెచ్సిఎకు పోటీ సంఘాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని బిసిసిఐ తమతో స్పష్టం చేసిందని వివేక్ తెలిపారు. ఇదిలా ఉంటే క్రికెట్ కమిటీల విషయంలో జస్టిస్ లోథా కమిటీ, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కాగా అమలుచేస్తున్నట్లు వివేక్ చెప్పారు.