అమెరికా: 90 ఏండ్ల ఓ వ్యక్తి 75 సంవత్సరాల కిందట ఓ ట్రాఫిక్ సిగ్నల్గా ఉపయోగించే స్టాప్ సైన్ బోర్డ్ను దొంగిలించాడు. 75 సంవత్సరాల క్రితం చేసిన దొంగతనానికి ఇప్పుడు క్షమాపణలు చెప్పాడు. ఈ సంఘటన యుఎస్లోని టెక్సాస్లో జరిగింది. ఇప్పుడు తను చేసిన తప్పిదాన్నిసరిచేసుకుందాం.! అనుకున్నాడో ఏమో గానీ… లేటైనా లేటెస్ట్గా తన తప్పును అంగీకరించాడు. అంతే కాదండోయ్ బాబో… తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా 50 డాలర్ల నోటును కూడా జతచేసి, క్షమాపణ లెటర్ రాసి… ఉటాహ్ అనే సిటీ పరిథిలో ఉన్న మిడ్వాలె పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కు పోస్ట్ చేశాడు. ఆ అపాలజీ లెటర్ను డిపార్ట్మెంట్ తమ ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో ప్రస్తుతం ఆ లెటర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆ వ్యక్తి గొప్పతనానికి పొంగిపోయిన డిపార్ట్మెంట్ అధికారులు అతన్ని పర్సనల్ గా కలుద్దామనుకున్నారు. కానీ అతను ఐడెంటిటీ ఏం లేకుండా లెటర్ పంపించడంతో అతడి పేరు, అడ్రస్ ను అధికారులకు దొరకలేదు. దీంతో తనకు తాను క్షమించుకొని మిగితా జీవితం అంతా సంతోషంగా గడిపితే చాలంటూ డిపార్ట్మెంట్ అధికారులు తెలియజేశారు.
We received the sweetest anonymous letter from a 90-year-old Texas gentleman, and just had to share with y'all. #texas #BlessHisHeart pic.twitter.com/z2A5k78gBz
— Midvale City, Utah (@MidvaleCity) June 20, 2018