Friday, April 19, 2024

మోహానికి, ప్రేమకు మధ్య జరిగే కథ

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది. పూరి కనెక్ట్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాను దర్శకుడు అనిల్ పాదురి తెరకెక్కించారు. అనిల్ పాదురి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ… ‘పూరి జగన్నాథ్ ‘రొమాంటిక్’ కథను నాకు ఇచ్చాడు. ఆ కథతో నేను కూడా ట్రావెల్ చేశాను. నాకు ఎంతో నచ్చిన కథ కావడంతో ఈ చిత్రానికి నేను దర్శకత్వం వహించాను. మోహానికి, ప్రేమకు మధ్య జరిగే కథే రొమాంటిక్. ఇందులో మంచి ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది. ట్రైలర్లో ఎక్కువగా రొమాన్స్ ఉంది కదా?అని సినిమా అంత అలానే ఉంటుందని కాదు. ఇది కేవలం యూత్ సినిమానే కాదు, ఫ్యామిలీ మొత్తం చూసేలా ఉంటుంది. పూరి రాసిన కథ, ఆయన అందించిన మాటలే అయినా కూడా నా మార్క్ కనిపిస్తుంది. నా కోణంలోంచే ఈ సినిమాను తీశాను. ప్రస్తుతం ఆకర్షణనే ప్రేమ అని అనుకుంటున్నారు. అందుకే కొద్ది కాలానికే విడిపోతోన్నారు. ప్రేమ, ఆకర్షణకు మధ్య ఉన్న సన్నని గీత గురించి ఈ సినిమాలో వివరించాం. ప్రేమను నమ్మని ఓ కుర్రాడు.. ప్రేమలో పడితే ఎలా ఉంటుందనేది కథ. ఈ కథకు ఆకాష్ కరెక్ట్‌గా సరిపోయాడు. పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. రమ్యకృష్ణ రావడంతో మా సినిమా లుక్ మారిపోయింది. ఆమె స్థాయికి తగ్గ పాత్ర ఇందులో చేశారు. ఆమె ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News