మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తరుణంలో భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని అసెంబ్లీ కార్యదర్శి ఈ మేరకు ఓ బులెటిన్ను విడుదల చేశారు. మంత్రులు, ఎంఎల్ఎలు తమ వ్యక్తిగత సిబ్బందని వెంట తీసుకురావొద్దని అసెంబ్లీ కార్యదర్శి కోరారు. అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కరోనా నేపథ్యంలో పలు నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించిందేకు ప్రత్యేక నిబంధనలు జారీ చేశారు. ఎంఎల్ఎ, ఎంఎల్సిలకు మాత్రమే అసెంబ్లీ లోపలికి అనుమతి ఉంటుదని స్పష్టం చేశారు. ఎంఎల్ఎలు తమ కార్లకు కచ్చితంగా పాస్ అతికించాలని అసెంబ్లీ కార్యదర్శి పేర్కొన్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. గుర్తు తెలియని వారికి అసెంబ్లీలోకి అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు.
అలాగే మంత్రులు, ఎంఎల్ఎల గన్మెన్లను అసెంబ్లీలోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. అలాగే అసెంబ్లీలోకి విజిటర్లను అనుమతించరాదని నిర్ణయించారు. అసెంబ్లీలోకి ఎలాంటి ఆయుధాలు తీసుకురావద్దని సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. బ్యానర్లు, ప్లకార్డ్స్, కర్రలు, స్ప్రేలు వంటివేవీ అనుమతించబోమని, అసెంబ్లీ ఆవరణంలో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని ఆదేశాలు ఇచ్చారు. సభ్యులంతా భౌతిక దూరం పాటించాలని సూచించారు. సభ్యులు పిఎస్లు, పిఎలు, పిఎస్ఓలను అసెంబ్లీలోకి అనుమతి లేదని ఆదేశాలు ఇచ్చారు.
AP Assembly sessions begins from June 16