- Advertisement -
మెల్బోర్న్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్ 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన బుమ్రా మెయిడెన్తో తన కోటాను ప్రారంభించాడు. బుమ్రా తన రెండో మూడో ఓవర్లో ఓపెనర్ జో బర్న్ను ఔట్ చేశాడు. దీంతో 10 పరుగుల వద్ద ఆసిస్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన లబుషేన్ జాగ్రత్తగా ఆడుతున్నాడు. జట్టు స్కోరు 35 రన్స్ వద్ద ఉండగా మాథ్యూ వేడ్ రూపంలో రెండో వికెట్ను కోల్పోయింది. ఈ వికెట్తో భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తన వికెట్ల ఖాతాను తెరిచాడు. మూడు పరుగుల వ్యవధిలోనే ఆసిస్ తన మూడో వికెట్ను కోల్పోయింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన అశ్విన్ 38 పరుగుల వద్ద స్టీవ్ స్మిత్ను అశ్విన్ డకౌట్ చేశాడు.
- Advertisement -