Friday, April 19, 2024

రాజపేటలో రోడ్డు ప్రమాదం: బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

రాజాపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట గ్రామంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురైన బాలుడు చనిపోయాడు. రాజపేట గ్రామానికి చెందిన బిర్రు శ్యామ్ రెండో కుమారుడు బిర్రు ధనుష్, (7) తెల్లవారుజామున రోడ్డు దాటుతున్న క్రమంలో అదిక వేగంతో దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా బాలుడు మార్గమధ్యంలోనే చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులకు డాక్టర్ తెలిపారు. సంఘటన స్థలానికి రాజపేట ఎస్సై సుధాకర్ రెడ్డి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News