Wednesday, April 24, 2024

చెన్నైలో కుప్పకూలిన పాత భవనం.. శిధిలాల కింద ఇరుక్కున్న నలుగురు

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఉత్తర చెన్నైలోని 70 ఏళ్ల నాటి బహుళ అంతస్తుల పాత భవనం బుధవారం కుప్పకూలి శిధిలాల కింద నలుగురు ఇరుక్కుపోయారు. మన్నాడే ప్రాంతంలో భవనానికి మరమ్మతులు చేస్తుండగా ఈ సంఘటన జరిగింది.

అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ యంత్రాంగంతో సహా అనేక సంస్థలు సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. ప్రమాదం జరిగేటప్పుడు దాదాపు 10 మంది కూలీలు పనిచేస్తున్నారని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News