Friday, March 29, 2024

ఈ నెల 12న విద్యా సంస్ధల బంద్‌కు పిలుపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఈ నెల 12 న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, ఇంటర్ కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు వామపక్ష విద్యార్ధి సంఘాలు పేర్కొన్నాయి. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బంద్ పోస్టర్ టి.నాగరాజు,మూర్తి (ఎస్.ఎఫ్.ఐ),పుట్టా లక్ష్మణ్,మణికంఠ రెడ్డి(ఎ.ఐ.ఎస్.ఎఫ్) పరుశురాం(పి.డి.ఎస్.యు),మహేష్(పి.డి.ఎస్.యు),రామకృష్ణ(పి.డి.ఎస్.యు),గవ్వ వంశీధర్ రెడ్డి(ఎ.ఐ.ఎస్.బి.),విజయ్(పి.డి.ఎస్.యు. విజృంభణ) ఆవిష్కరణ చేశారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేట్ ఫీజులు దందా కొనసాగుతున్న ప్రభుత్వం వాటి నియంత్రణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రులు ఉపసంఘం, తిరుపతిరావు కమిటీ రిపోర్ట్ బహిర్గతం చేయకపోవడం చూస్తే ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనూకులంగా వ్యవరిస్తున్నట్లుగా ఉందని అన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా యూనిఫామ్ ఇవ్వలేదని, కొన్ని టైటిల్స్ పాఠ్యపుస్తకాలు పంపలేదన్నారు. చదువులు చెప్పే టీచర్లు లేరు, పారిశుద్ధ్య కార్మికులు లేరని, అనేక సమస్యలతో విద్యాసంవత్సరం ప్రారంభమైన నిర్ధిష్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదన్నారు. త్రాగునీరు, మధ్యాహ్న భోజనం బిల్లుల పెండింగ్, ముత్రశాలలు, సరైన మౌళిక సదుపాయాలు లేక ప్రభుత్వ విద్యారంగం గోల్లుమంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. మన ఊరు-మనబస్తీ-మనబడి నిధులు గుత్తేదారులు తూతూమంత్రంగా మాత్రమే పనులు జరిగాయి కానీ ఎక్కడ సరిగ్గా పాఠశాలలకు ఉపయోగ పడింది లేదన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం హామీ అందని ద్రాక్షగా మారింది. ఇంటర్ విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు ఇంకా అందివ్వలేదు. లెక్చరర్స్ లేరు. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి.

రాష్ట్రంలో గత నాలుగేళ్ల నుండి ఫీజు రీయంబర్స్ మెంట్స్, ఉపకార వేతనాలు రూ. 5,177 కోట్లు పెండింగులో ఉన్నాయి. వాటిని కనీసం విడుదల చేయడం లేదని మండిపడ్డారు. గురుకులాలు, కెజిబివిలు, ఇంటర్ కళాశాలలుగా అఫ్ గ్రేడ్ చేసిన కెజిబివిలు భవనాలు లేక అరకొర సౌకర్యాలతో అద్దె భవనాల్లో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. వాటికి నిధులు లేవు, లెక్చరర్స్, టీచర్స్ లేరు నాణ్యమైన భోజనం లేక పుడ్ ఫాయిజాన్స్‌తో విద్యార్థులు ఆనారోగ్యం పాలైతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారీ సంఖ్యలో టీచర్,లెక్చరర్స్ ఖాళీలు ఉన్నా వాటి భర్తీ చేయడం లేదు, ఒక్క డిఎస్సీ ఇప్పటివరకు వేయలేదు. అందుకే ఈ సమస్యలను పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను కదిలించి బంద్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News