Saturday, April 20, 2024

సోమవారం నుంచి రైతుబంధు సహాయం..

- Advertisement -
- Advertisement -

CM KCR Review on Rythu Bandhu at Pragathi Bhavan

హైదరాబాద్‌: రైతుబంధు నగదు పంపిణీపై అధికారులతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 28వ తేదీ(సోమవారం) నుంచి వచ్చేనెల జనవరి వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు సిఎం కెసిఆర్ వెల్లడించారు. రాష్ట్రంలోని 61.49 లక్షల మంది రైతులకు ఎకరానికి ఐదు వేల చొప్పున 2020 యాసంగి సీజన్ కు ప్రభుత్వం రూ.7,515 కోట్లను పంట సాయంగా ఇవ్వనున్నట్లు కెసిఆర్ తెలిపారు. రైతులందరికీ డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయాలని అధికారులను ఈ సందర్భంగా కెసిఆర్ ఆదేశించారు.

CM KCR Review on Rythu Bandhu at Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News