ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1,01,700 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, టివి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. రాజస్థాన్ రాష్ట్రం, నాగోర్ గ్రామానికి చెందిన దాగా అభిషేక్ నగరానికి వలస వచ్చి సుల్తాన్ బజార్లో ఉంటున్నాడు. బర్కత్పురకు చెందిన జతిన్ మస్రానే ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన దినేష్ కనుంగో నగరంలోని బల్కంపేటలో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. ప్రధాన నిందితుడు గోవాకు చెందిన మారీ పరారీలో ఉన్నాడు. ప్రధాన నిర్వాహకుడు అభిషేక్ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించడం అలవాటు ఉంది.
సులభంగా డబ్బులు సంపాదించాలని సుల్తాన్ బజార్లో గేమింగ్ హౌస్ నిర్వహిస్తున్నాడు. పంటర్లను నియమించుకుని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రధాన బూకీ మేరి పరిచయం అయ్యాడు. www.bet777exch.com యాప్ ద్వారా ఆసక్తి ఉన్న వారి నుంచి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న మ్యాచ్లకు బాల్ టు బాల్కు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. విషయం తెలియడంతో నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. ఇన్స్స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్సైలు పరమేశ్వర్, శ్రీకాంత్, అశోక్ రెడ్డి, శివానందం తదితరులు పట్టుకున్నారు.