Friday, April 26, 2024

ప్రజాస్వామాన్ని ఖూనీ చేసింది కాంగ్రెస్సే: కర్నె

- Advertisement -
- Advertisement -

Democracy killed by congress at telangana

హైదరాబాద్: కాంగ్రెస్ చేపట్టిన ఛలో రాజ్‌భవన్ హాస్యాస్పదమని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ విమర్శించారు. కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. జాతీయ పార్టీ అని చెప్పుకుంటారుకానీ జాతీయ విధానమే లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికో విధానంతో రాజకీయాలు చేస్తోందని, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక విధానం, అధికారం లేని రాష్ట్రాల్లో మరో విధానము ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజకీయ చరిత్రలో ప్రజాస్వామాన్ని ఖూనీ చేసిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. కాంగ్రెస్ నేర్పిన రాజకీయాన్ని ఇవాళ దేశంలో బిజెపి చేస్తోందని ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News