తిరుమల : తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10గంటలు, టైమ్స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 73,711 మంది దర్శించుకున్నారు. 24,003 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. మంగళవారం శ్రీవారి హుండీకి రూ.3,57 కోట్ల ఆదాయం సమకూరిందని టిటిడి అధికారులు తెలిపారు.