జయశంకర్ భూపాలపల్లి: కొడుకు, కోడలు నిర్లక్ష్యంగా చూడడంతో మనస్థాపానికి గురైన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని చిట్యాల గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఇంటిప్రక్కల వారు వృద్ధ దంపతులు చనిపోయినట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన రాజయ్య(65), లక్ష్మీ(60) దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు, కోడులుతో కలిసి దంపతులు ఇద్దరు నివాసం ఉంటున్నారు. అయితే, కొడుకు, కోడులు తమను సరిగా పట్టించుకోకుండా, మంచిగా చూసుకోకపోవడంతో మనస్థాపం చెందిన ఆ దంపతులు.. ఇక చనిపోవాలని నిర్ణయించుకొని రాత్రి పడుకునే ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం ఇరుగుపొరుగు వారు చనిపోయిన దంపతులను చూసి కొడుకు, కోడలిని నిలదీశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Elderly couple commits suicide in Cityala