- Advertisement -
పెద్దపల్లిః జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ధర్మారం మండలంలో బంజరుపెల్లి వద్ద ఎదురెదురుగా వేగంగా వచ్చిన కారు, లారీ ఢీ కొనడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు శంకరయ్య, అశోక్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.
Father and Son died in Road Accident
- Advertisement -