Thursday, March 28, 2024

భారీ అగ్ని ప్రమాదం.. సిలిండర్ పేలి హోటల్ యజమాని మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రంగారెడ్డినగర్ లోని ఓ హోటల్ లో మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. దీంతో హోటల్ లో ఉన్న సిలిండర్ పేలడంతో యజమాని సురేష్ మృతి చెందాడు.

సమాచారం అందుకున్న బాలానగర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News