- Advertisement -
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలంలో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. భారత్ బంద్ లో భాగంగా నిరసన చేస్తున్న కార్యకర్తలు బాణాసంచా పెల్చారు. బాణాసంచా పేల్చడంతో నిప్పురవ్వలు కారుపై పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధం అయింది. బంద్ లో భాగంగా కాంగ్రెస్ నిరసన కార్యక్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఫైరింజన్ వచ్చేలోపే మంటల్లో కారు పూర్తిగా కాలిపోయినట్టు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
- Advertisement -