- Advertisement -
ఫిరంగిపురం: గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండలం రూపూడి వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన ఓ టాటా ఏస్ వాహనం ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా… పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. జిల్లాలో నిన్నటి నుండి కురుస్తున్న చిరుజల్లుల వల్లే వాహనం అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు స్థానికులు చెబుతున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Five Died in Road Accident At Phirangipuram Guntur
- Advertisement -