Friday, April 19, 2024

హైదరాబాద్ లో పరువు హత్య కలకలం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహానగరంలో పరువు హత్య కలకలం సృష్టిస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని అమ్మాయి తండ్రి అతి దారుణంగా కిరాయి హంతకులతో హత్య చేయించిన సంఘటన హైదరాబాద్‌లోని చందానగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చందానగర్‌కు చెందిన హేమంత్ అనే యువకుడు స్థానికంగా ఉండే అవంతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ వివాహాన్ని యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. పెళ్లి తరువాత యువతి, యువకుడి కలిసి గచ్చిబౌలిలోని టిఎన్‌జిఒ కాలనీలో నివాసం ఉంటున్నారు. యువతి తండ్రి కిరాయి హంతకులతో హేమంత్, తన కూతురిని కిడ్నాప్ చేయించాడు. కిడ్నాపర్ల చెర నుంచి యువతి తప్పించుకొని 100కి సమాచారం ఇచ్చింది. హేమంత్‌ను మాత్ర సంగారెడ్డి వైపు తీసుకెళ్లారు. వెంటనే యువతి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా హేమంత్ మృతదేహం సంగారెడ్డి జిల్లా కిష్టాయగూడెం గ్రామ శివారులో ఉందని తెలిపారు. గచ్చిబౌలి పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. 100కు ఫోన్ చేసినప్పుడు పోలీసులు త్వరగా స్పందించే ఉంటే హత్య జరిగేది కాదని యువతి ఆవేదన వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News