Saturday, April 20, 2024

భార్యను హతమార్చిన భర్త

- Advertisement -
- Advertisement -

లింగాల : కట్టుకున్న భార్యను క్షణికావేశంలో కొట్టి హతమార్చిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని వడ్డెరాయవరం సమీపంలోని నల్లకుంట బ్రిడ్జి పక్కన మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ధారారం గ్రామానికి చెందిన పర్వతాలు, పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం గ్రామానికి చేందిన ఏదుల లక్ష్మి(35)ని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కాగా 15 ఏళ్ల క్రితం లక్ష్మి ఒక కుమారుడిని తీసుకుని భర్తను వదిలి వెళ్లింది. కాగా 13 ఏళ్ల క్రితం పర్వతాలు లింగోటం గ్రామానికి చెందిన కృష్ణవేణిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. రెండో భార్యతో కలిసి ధారారం గ్రామంలో కులవృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో పర్వతాలు గత 3 నెలల కితం బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి వదిలేసిన మొదటి భార్య లక్ష్మి వద్దకు వెళ్లి ఇద్దరు వికారాబాద్ జిల్లా తాండూరులో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ధారారం గ్రామంలో బొడ్రాయి పునః ప్రతిష్ట ఉత్సవాలలో భాగంగా మంగళవారం బోనాల పండుగలో పొల్గొనడానికి తాండూరు నుంచి లక్ష్మి, పర్వతాలు సోమవారం సాయంత్రం లింగాలకు వచ్చారు. కొడుకు చేత బైక్ తెప్పించుకున్న పర్వతాలు లక్ష్మిని తీసుకుని అంబటిపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లారు.సోమవారం రాత్రి ఆమెను తీసుకుని యాపట్ల మార్గాన ధారారంకు వస్తూ మార్గమధ్యలో వడ్డెరాయవరం సమీపంలోని నల్లకుంట బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు.

ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో క్షణికావేశంలో పర్వతాలు లక్ష్మిని కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మంగళవారం సంఘటన స్థలానికి పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతురాలి అక్క ఏదు ల జయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐ అనుదీప్ పర్యవేక్షణలో ఎస్సై శ్రీనివాసులు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News