Saturday, April 20, 2024

ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్ ఆధిపత్యం..

- Advertisement -
- Advertisement -

ICC ODI Rankings 2020 Released

ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల అధిపత్యం కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో టీమిండియా ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకపోయినా తాజగా ఐసిసి ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు కీలక స్థానాల్లోనే కొనసాగుతున్నారు. బ్యాట్స్‌మెన్స్ జాబితాలో విరాట్ కోహ్లీ 871 పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకోగా, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 855 పాయింట్లతో రెండో స్థానంలోనే కొనసాగుతున్నాడు. జింబాబే సిరీస్‌లో రాణించిన పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజామ్ 8 పాయింట్లను మెరుగు పర్చుకుని మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇక, బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా స్పీడ్ స్టన్ జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్ రౌండర్స్ జాబితాలో బంగ్లాదేశ్ ఆటగాడు షకి బుల్ హాసన్, అప్ఘనిస్థాన్ ఆటగాడు మహ్మద్ నబి తొలి రెండు స్థానంలో కొనసాగుతున్నారు.

ICC ODI Rankings 2020 Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News