Tuesday, April 16, 2024

స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనని అధికారులపై కఠిన చర్యలు

- Advertisement -
- Advertisement -

independence day celebrations 2021

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద జరిగే కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న అధికారులంతా హాజరు కావాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్‌గౌబ ఆదేశించారు. హాజరుకానిపక్షంలో కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈమేరకు కేంద్రంలోని అన్ని శాఖల కార్యదర్శులకు సర్కులర్ జారీ చేశారు. అయితే,కొవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని ఈసారి జాయింట్ సెక్రటరీ, ఆపైస్థాయి అధికారులకు మాత్రమే ఆహ్వానం పంపినట్టు పేర్కొన్నారు. గతంలో ఈ కార్యక్రమానికి కొందరు అధికారులు హాజరు కాలేదన్న సమాచారమున్నందున ఈ ఆదేశాలివ్వాల్సి వచ్చిందని రాజీవ్‌గౌబ తెలిపారు. ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోడీ జాతీయ జెండాను ఎగురవేసి, సందేశమిచ్చే జాతీయ ప్రాధాన్యత ఉన్న కార్యక్రమమని గౌబ గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News