Thursday, March 28, 2024

శ్రేయస్ శతక్కొట్టుడు.. దక్షిణాఫ్రికాపై 7వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

India won by 7 wickets against South Africa

సెంచరీతో మెరిసిన అయ్యర్
ఇషాన్‌దార్ బ్యాటింగ్
దక్షిణాఫ్రికాపై 7వికెట్ల తేడాతో గెలిచిన భారత్
హెండ్రిక్స్, మార్క్రమ్ అర్ధశతకాలు వృథా
సిరీస్ 1-1తో సమం

రాంచీ : దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన కీలక సెండో వన్డేలో భారత్ సత్తా చాటింది. సఫారీజట్టుపై 7వికెట్లు తేడాతో గెలిచి సిరీస్‌ను 11తో సమం చేసింది. బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌లోనూ ప్రొటీస్‌పై ధావన్‌సేన పైచేయి సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ప్రధానంగా సిరాజ్ 3 వికెట్లతో అడ్డుకోగా బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ఆకాశం హద్దుగా బ్యాట్‌తో చెలరేగిపోయారు. ఇషాన్ కిషన్ 7సిక్సర్లతో 93పరుగులు చేసి రెచ్చిపోగా..శ్రేయస్ అయ్యర్ అజేయ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ విజృంభించడంతో దక్షిణాఫ్రికా నిర్దేశించిన విజయలక్ష్యాన్ని 45.5 ఓవర్లలోనే కోల్పోయి సాధించి ఛేదించింది. ఏడు వికెట్ల తేడాతో గెలిచిన వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకునే దిశగా దూసుకుపోయింది. శతకంతో అలరించిన శ్రేయస్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

శ్రేయస్, ఇషాన్ ధనాధన్

సౌతాఫ్రికా నిర్దేశించిన పరుగుల లక్షఛేదనలో భారత్ ఆదిలో తడబాటుకు గురైంది. ఓపెనింగ్ జోడీ ధావన్, గిల్ పటిష్ఠ వేయడంలో విఫలమయ్యారు. కెప్టెన్ ధావన్ పార్నెల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 28పరుగుల వద్ద భారత్ తొలి కీలక వికెట్ కోల్పోయింది. గిల్ కుదురుకుంటున్న దశలో బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి బంతుల్లో చేసిన పెవిలియన్‌కు చేరుకున్నాడు. 48పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఈ దశలో ఇషాన్ కిషన్,శ్రేయస్ అయ్యర్ సౌతాఫ్రికా బౌలర్లకు చెమటలు పట్టించారు. బౌండరీలు, సిక్సర్లుతో చెలరేగిపోయారు. ఇషాన్ కిషన్ సిక్సర్లతో మెరుపులు మెరిపిస్తే, శ్రేయస్ అయ్యర్ బౌండరీల వర్షం కురిపించాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొడుతున్న ఇషాన్ కిషన్‌ను ఫర్చూన్ అడ్డుకున్నాడు. 84బంతుల్లో పరుగులు చేసిన సెంచరీ ముంగిట ఫర్చూన్ బౌలింగ్‌లో హెండ్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 209 పరుగులు వద్ద ధావన్ సేన మూడో వికెట్ పడింది. జోరుమీదున్న బంతుల్లో చేసి సెంచరీతో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. వికెట్‌కీపర్ సంజూ శాంసన్ పరుగులతో తనవంతు సహకారాన్ని నష్టానికి పరుగులు చేసి సాధించింది.

డికాక్‌కు సిరాజ్ షాక్

రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో తొలుత టాస్ గెలిచిన సఫారీజట్టు ఎంచుకుంది. అనారోగ్యంతో సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా, స్పిన్నర్ షమ్సీ మ్యాచ్‌కు దూరమవగా రీజా ఫర్చూన్ జట్టులో చేరారు. సఫారీ జట్టు కెప్టెన్‌గా మహారాజ్ వ్యవహరించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. క్వింటన్ డికాక్ సిరాజ్ బౌల్డ్ చేశాడు. అనంతరం షాబాజ్ అహ్మద్ స్పిన్ మాయాజాలంతో మలన్ బోల్తా కొట్టించి ఎల్బీగా పెవిలియన్‌కు పంపాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మార్క్రమ్.. హెండ్రిక్స్‌తో కలిసి సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను ఆదుకున్నాడు. కుల్దీప్ బౌలింగ్‌లో మార్క్రమ్‌కు లైఫ్ లభించింది. అవేశ్‌ఖాన్ బౌలింగ్‌లోనూ మరో లైఫ్ లభించడంతో ఊపిరి పీల్చుకుని హాఫ్‌సెంచరీ దిశగా దూసుకుపోయాడు. ఈక్రమంలో మార్క్రమ్, హెండ్రిక్స్ హాఫ్‌సెంచరీలు పూర్తి చేసుకున్నారు. మూడో వికెట్‌కు వీరిద్దరూ 129పరుగుల భాగస్వామ్యాన్ని క్రీజులో పాతుకుపోయిన ఈ జోడిని సిరాజ్ విడదీశాడు.

76 బంతుల్లో సిక్స్‌తో 74పరుగులు చేసిన బౌలింగ్‌లో అహ్మద్‌కు క్యాచ్‌ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. 215పరుగుల వద్ద సౌతాఫ్రికా కోల్పోయింది. కుల్దీప్ బౌలింగ్‌లో యత్నించిన క్లాసెన్ లాంగాన్‌లో ఉన్న సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే ఇదే స్కోరు వద్ద బౌలింగ్‌లో మార్క్రమ్ కూడా ఔటయ్యాడు. 89 బంతుల్లో సిక్స్‌తో 79పరుగులు చేసి పార్నెల్ (16)ను ఠాకూర్, మహారాజ్ (5)ను సిరాజ్ పెవిలియన్‌కు పంపారు. 34బంతుల్లో ఫర్చూన్ (0) నాటౌట్‌గా నిలిచారు. చివరి ఓవర్లో సిరాజ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మహారాజ్ వికెట్ తీయడంతోపాటు 3పరుగులు మాత్రమే ఇచ్చాడు. మొత్తంమీద కోల్పోయి చేసింది. భారత హైదరాబాదీ స్టార్ సిరాజ్ 10ఓవర్ల కోటాలో మెయిడిన్ ఓవర్‌తోసహా 3వికెట్లు తీసి సుందర్, ఠాకూర్ తలో వికెట్ దక్కించుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News