Thursday, March 28, 2024

రెండో టెస్టు భారత్ దే… సిరీస్ కైవసం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. శ్రీలంకపై భారత జట్టు 238 పరుగుల తేడాతో గెలిచింది. టీమిండియా 2-0 తేడాతో సిరీస్ గెలిచింది.  లంక కెప్టెన్ కరుణరత్నె సెంచరీతో చెలరేగినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. లంక బ్యాట్స్‌మెన్లలో మెండీస్ 54 పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్లు సింగల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టగా బుమ్రా మూడు వికెట్లు, అక్షర పటేల్ రెండు వికెట్లు, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు. శ్రేయస్ అయ్యర్ రెండు ఇన్నింగ్స్ ల్లో కలిసి 159 పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్  వరించింది.  మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రిషబ్ పంత్ తీసుకున్నాడు.

ఇండియా తొలి ఇన్నింగ్స్: 252

ఇండియా రెండో ఇన్నింగ్స్: 303

శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 109

శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 208

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News