Friday, April 19, 2024

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

నార్కెట్‌పల్లి: బస్సు ప్రయాణికులే లక్ష్యంగా చోరీలు చేస్తున్న తొమ్మిది మంది అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ఉత్తర ప్రదేశ్ కి చెందిన ముఠాగా గుర్తించారు. నిందితుల నుంచి రూ. 10 లక్షల నగదు, 9 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆదివారం నార్కట్ పల్లి దగ్గర దాబా వద్ద పోలీసులు ముఠాను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News