Friday, April 26, 2024

దుబాయిలో కోహ్లీ, అనుష్క సంబరాలు..

- Advertisement -
- Advertisement -

kohli and anushka Celebrations in UAE

కరోనా కారణంగా వాయిదా పడిన ఐపిఎల్ మెగా టోర్నీ సెప్టెంబర్ 19 నుంచి దుబాయిలో ప్రారంభం కానుంది. ఇప్పటికే దాదాపు అన్ని జట్లు యుఎఇ చేరుకున్నాయి. శుక్ర‌వారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆట‌గాళ్ళ క్వారంటైన్ పూర్తి కావడంతో.. ఆటగాళ్లందరిని ఒకచోటుకి చేర్చింది ఆర్ సిబి. దీంతో ఆటగాళ్లు అందరూ ఒకనొకరు కలుసుకున్నారు. అందరు కలిసి భోజనం చేయడంతోపాటు ఇండోర్ గేమ్స్ ఆడుతూ ఆనందంగా గడిపారు. శుక్రవారం సాయంత్రం ప్రాక్టీస్ సెష‌న్స్‌లో  కూడా పాల్గొన్నారు. ఇక, ఆర్ సిబి కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతులు వచ్చే ఏడాది జనవరిలో తల్లిదండ్రులు కానున్న సందర్భంగా జట్టు సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుక చేసుకున్నారు. అలాగే, ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా అందరి సమక్షంలో కేక్ కట్ చేశాడు. దీంతో ఆటగాళ్లందరూ చాలా రోజుల తర్వాత ఒకచోట చేరడంతో సంతోషంగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియోలను ఆర్ సిబి ట్వీట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

kohli and anushka Celebrations in UAE

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News