Saturday, April 27, 2024

నల్లగొండలో ప్రేమజంట ఆత్మహత్య….

- Advertisement -
- Advertisement -

Lovers commit suicide at nalgonda

 

కేతేపల్లి: ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం బొప్పారం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  గుడివాడకు చెందిన రాచకొండ శ్రీను(26), చిత్తలూరు నాగేశ్వరి(18) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.  వీళ్ల ప్రేమ వ్యవహారం కొనసాగుతుండగానే శ్రీనుకు మార్చి నెలలో పెళ్లి చేశారు. ఇద్దరు కలిసి గ్రామ నుంచి బయటకు వచ్చి బొప్పారం గ్రామ శివారులో కూల్ డ్రింక్స్ లో పురుగుల మందు కలుపుకొని తాగారు. బొప్పారం గ్రామస్థులు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ ప్రేమ జంట కన్నుమూసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News