హైదరాబాద్: తనకు కరోనా సోకిందని తన్నెవరూ తాకొద్దంటూ లేఖ రాసి వివాహిత ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హైదరాబాద్ శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్లో చోటుచేసుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… స్థానికంగా నివాసముండే చిత్తూరు జిల్లాకు చెందిన గృహిణి (37) భర్త, కొడుకు (12)తో కలసి అల్కాపూర్లో నివసిస్తున్నారు. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత అందరూ కలిసే పడుకున్నారు. ఆదివారం ఉదయం 10గంటల సమయంలో నిద్రలేచిన భర్త.. భార్య కనిపించకపోవడంతో పక్క గదిలోకి వెళ్లి చూశాడు.
గదిలో ఆమె ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. దీంతో షాక్ గురైన ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంట్లో పరిశీలించగా ఓ లెటర్ దొరికింది. అందులో తనకు కరోనా సోకిందని, తనను ఎవరూ తాకవద్దని అందులో రాసిపెట్టి ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఆమె ఎక్కడ పరీక్షలు చేయించుకుంది..? ఫలితం ఎప్పుడు వచ్చింది..? అన్న విషయాలపై నార్సింగ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.