ఢిల్లీ: జాతిపిత మహాత్మాగాందీ 70వ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు రాజ్ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. రాజ్ ఘాట్ లోని మహాత్మాగాంధీ సమాధి వద్ద రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. మహాత్ముడితో పాటు, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అమరవీరుల ధైర్య సహసాలను ఎప్పటికి స్మరించుకుంటునే ఉంటామని మోడీ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.