న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 19న ప్రారంభమవుతాయని శుక్రవారం లోక్సభ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశాలు ఆగస్టు 13 ఏరకు కొనసాగే అవకాశముందని ఆ ప్రకటన తెలిపింది. ‘ 17వ లోక్సభ ఆరో సమావేశాలు జూలై 19న ప్రారంభమవుతాయి. ప్రభుత్వ బిజినెస్ను బట్టి ఈ సమావేశాలు ఆగస్టు 13న ముగియవచ్చు’ అని ఆ ప్రకటన తెలిపింది. కాగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ జూలై 19న సభను సమావేశపర్చాలనిఆదేశించారని, ఈ సమావేశాలు ఆగస్టు 13న ముగుస్తాయని రాజ్యసభ కూడా ఒక ప్రకటనలో తెలియజేసింది. సాధారణంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై మూడో వారంలో ప్రారంభమై స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ముగుస్తుంటాయి. కాగా జూలై 19నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని ఇంతకు ముందు పార్లమెంటు వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.
19నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -