Friday, March 29, 2024

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/భిక్కనూర్ :  కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులో ఉన్న 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దివ్య రెస్టారెంట్ వద్ద మంగళవారం హైదరాబాద్ నుండి వస్తున్న కారు వెనుక నుండి బైక్‌ను ఢీకొనడంతో యువకుడు క్రిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన నవీన్ కుమార్, తన మిత్రుడు ద్విచక్రవాహనం పై కామారెడ్డికి వెళ్తుండగా వెనుక నుండి వస్తున్న కారు ఢీకొనడంతో నవీన్ (27) అక్కడికక్కడే క్రింద పడి మృతి చెందగా మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పంచనామా నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News