పవర్ స్టార్ పవన్కల్యాణ్ స్పీడ్ చూస్తుంటే ఎవరైనా షాక్ తినాల్సిందే. వెంట వెంటనే ఒకదాని వెంట ఒకటిగా సినిమాల ముహూర్తాలు చేసేస్తూ… షూటింగులతో క్షణం తీరిక లేనంత బిజీ అయిపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొన్నటికి మొన్న ఇలా ‘పింక్’ రీమేక్ షూటింగ్ సైలెంటుగా మొదలు పెట్టేసిన పవన్… గుట్టుచప్పుడు కాకుండా బుధవారం తన 27వ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించేయడం విశేషం. ఈ కార్యక్రమానికి పవన్ హాజరవ్వడం షాక్కి గురి చేస్తోంది. ఈ స్పీడ్ చూస్తుంటే ఇక పవర్ స్టార్ని ఆపడం కష్టమేనని చెప్పాలి.
దాదాపు 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏ.ఎం.రత్నం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇదో హిస్టారికల్ వారియర్ కథాంశం అన్న ప్రచారం ఇప్పటికే సాగుతోంది. పాన్ ఇండియా కేటగిరీలో అన్ని భాషల్లోనూ ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరి 4 నుంచి రెగ్యులర్ చిత్రీకరణను ప్రారంభించి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో తొలి షెడ్యూల్ని తెరకెక్కించనున్నారు. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.