జయశంకర్ భూపాలపల్లి : రేగొండ మండలం పాండవుల గుట్ట సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం త్రోవకుంట గ్రామానికి చెందిన దుడ్డి యోసోబు, గాలి ప్రవీణ్కుమారలు విద్యుత్ సబ్ స్టేషన్ను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో వారు మద్యం సేవించారు. ప్రవీణ్కుమార్కు, యోసోబుకు మధ్య వివాదం తలెత్తింది. దీంతో ప్రవీణ్కుమార్ దుడ్డుకర్రతో యోసోబు తలపై కొట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.