- Advertisement -
ముంబై: దేశంలో వరసగా మూడో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా మంగళవారం లీటర్ పెట్రోల్ పై 54పైసలు, డీజిల్ పై 58 పైసలు పెంచినట్టు చమురు సంస్థలు తెలిపాయి. దేశరాజధాని ఢిల్లీలో సోమవారం లీటర్ పెట్రోల్ ధర రూ.72.46గా ఉండగా ఈరోజు 54 పైసలు పెరిగి రూ.73కి పెరిగింది. డీజిల్ ధర నిన్న లీటరుకు రూ.70.59 ఉండగా… ఇవాళ 58పైసలు పెరిగి రూ.71.17కి చేరింది. గడిచిన తొలి రెండ్రోజులు లీటర్ పెట్రోల్, డీజిల్ పై చమురు సంస్థలు. 60 పైసలు చొప్పున పెంచిన సంగతి తెలిసిందే.
Petrol and diesel price hike in india
- Advertisement -