హైదరాబాద్ : మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో అనుమానస్పందంగా అతడు మృతి చెందినట్టు సమాచారం. పాయిజన్ తీసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటాడని సమాచారం. రెండు రోజుల నుంచి ఆర్య వైశ్య భవన్ లో మారుతీరావు గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. రూమ్ క్లీన్ చేసే వాళ్లు వచ్చే చూసేసరికి అతడు చనిపోయి ఉండడంతో ఆర్య వైశ్య భవన్ వాళ్లకు సమాచారం ఇచ్చారు. ఆర్య వైశ్య సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకుందనే ఆగ్రహంతో.. కిరాయి హంతక ముఠాతో అల్లుడు ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించాడు. ప్రణయ్ హత్య కేసులో అనుకూలంగా సాక్ష్యం చెబితే ఆస్తి తన పేరున రాసిస్తానని మధ్య వర్తులతో అమృతకు రాయబారం పంపడంతో ఆమెను వేధింపులకు గురి చేశాడు. దీంతో అమృత ఫిర్యాదుతో మారుతీ రావును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పిడి యాక్ట్ కేసులో ఆరు నెలల క్రితం జైలు నుంచి మారుతీ రావు విడుదలయ్యారు.