Thursday, April 25, 2024

జైళ్లో ప్రేమ ఖైదీ ఆత్మహత్య….

- Advertisement -
- Advertisement -

Prisoner commits suicide in Jail

 

సంగారెడ్డి: ప్రేమికుల రోజున ప్రేమ ఖైదీ జైళ్లో ఉరేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పర్వతగిరి గ్రామానికి చెందిన భానుచందర్ (24), మేనమామ కూతురు స్వర్ణలత గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ వ్యవహారం స్వర్ణలత కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆమెను హెచ్చరించారు. భానుచందర్, స్వర్ణలత ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. స్వర్ణలత కుటుంబ సభ్యులు ప్రేమ వివాహాన్ని అంగీకరించలేదు. ఇద్దర్నీ దూరం పెట్టారు. ప్రేమికుడు దూరం కావడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. తమ కుమార్తె మరణానికి భానుచందర్ కారణమని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి భానుచందర్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు లేకపోవడంతో అతడు చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. 14 పేజీల సూసైడ్ నోట్ రాసి తన చావుకే తానే కారణమన్నాడు. బాత్‌రూమ్‌లో దుప్పటితో వెంటిలేటర్ చువ్వలకు ఉరేసుకొని చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News