Friday, March 29, 2024

టీకాలు తగ్గుతున్నాయి… మృతుల సంఖ్య పెరుగుతోంది: రాహుల్

- Advertisement -
- Advertisement -

Rahul gandhi comments on Modi govt

 

ఢిల్లీ: దేశంలో టీకాలు తగ్గిపోతున్నాయని కరోనా మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకపడ్డారు. అబద్దాలను వ్యాప్తి చేయడం, దృష్టి మళ్లించడం, నిజాలను దాచడమే మోడీ ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. ఈ మేరకు టీకా పంపిణీ, కరోనా మరణాలను సూచించే గ్రాఫ్‌లను రాహుల్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. గత 24 గంటల్లో 2.83 లక్షల కరోనా కేసులు నమోదుకాగా 4529 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 2.55 కోట్లకు చేరుకోగా 2.83 లక్షల మంది చనిపోయారు. కరోనా వ్యాధి నుంచి 2.19 కోట్ల మంది కోలుకోగా 32.97 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 32 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశారని ఐసిఎంఆర్ ప్రకటించింది. 18.6 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News