Tuesday, April 23, 2024

తాళ్లతో బంధించుకొని…. విద్యార్థిని అత్యాచారం డ్రామా…

- Advertisement -
- Advertisement -

Rape on student in Karnataka

 

బెంగళూరు: హోమ్ వర్క్ నుంచి తప్పించుకునేందుకు ఓ బాలిక తన కిడ్నాప్ చేసి అత్యాచారం పాల్పడ్డారని డ్రామా ఆడిన సంఘటన కర్నాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని యల్లాపురలో జరిగింది. ఆమెకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం బాలిక చెబుతున్నవి అబద్దమని వైద్యులు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..  సందోళ్లి గ్రామానికి చెందిన ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. పాఠశాలకు వెళ్లి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు వెతికడం ప్రారంభించారు. బాలిక కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సందోళ్లి శివారులో బాలికను తాళ్లతో కట్టేసినట్టు పోలీసులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు వ్యక్తులు తనని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని పోలీసులకు తెలిపింది. వైద్య పరీక్షల్లో అత్యాచారం జరగలేదని డాక్టర్లు తెలపడంతో పోలీసులు తనదైన శైలిలో బాలిక ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. హోమ్ వర్క్ చేయనందుకు అత్యాచార, కిడ్నాప్ డ్రామా ఆడానని పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News