హైదరాబాద్: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘నక్షత్రం’. ఇప్పటికే మూవీకి సంబంధించిన సందీప్కిషన్ ఫస్ట్లుక్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని రెజీనా ఫస్ట్లుక్ను హీరో రాంచరణ్ విడుదల చేశాడు. సందీప్ కిషన్, రెజీనా జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. నక్షత్రం మూవీలో రెజీనా జమునా రాణి పాత్రలో కనిపించనున్నట్లు సందీప్ కిషన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. నక్షత్రం మూవీలో రెజీనా ఫస్ట్లుక్ పోస్టర్ మీకోసం.