Saturday, April 20, 2024

తిరుపతిలో ఆర్టీసీ బస్సు బీభత్సం

- Advertisement -
- Advertisement -

Road Accident in Tirumala Tirupati

అమరావతి: తిరుపతి కర్నాలవీధిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ బస్సు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. అలాగే నాలుగు బైకులు ధ్వంసం అయ్యాయి. ప్రమాదం ధాటికి 2 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మరో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బస్సు ఆగిపోయింది. రైల్వే స్టేషన్ నుంచి తిరుమలకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం వల్లే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News