Friday, April 19, 2024

వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Road accident in Vikarabad Seven killed

 

వికారాబాద్‌: వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొనడంలో ఏడుగురు మరణించగా, పలువులు గాయపడ్డారు. శనివారం ఉదయం మోమిన్‌పేట మండలం చిట్టంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొన్నాయి. దీంతో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నదని తెలిపారు. ప్రమాదంలో మృతిచెందినవారిని కూలీలుగా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News