Friday, April 19, 2024

వరంగల్ జిల్లాలో రోడ్డుప్రమాదం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

వర్ధన్నపేట: వరంగల్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఆగివున్న లారీని ఢీకొట్టింది. వర్ధన్నపేట పట్టణ శివారులోని డీసీ తండా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులను తల్లిదండ్రులు( కృష్ణారెడ్డి, వరలక్ష్మి), కుమారుడి(వెంకటసాయి రెడ్డి)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట సర్కార్ దవాఖానకు తరలించారు. ఒంగోలు నుంచి వరంగల్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News