Friday, March 29, 2024

విద్యార్థినిలపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులు…

- Advertisement -
- Advertisement -

Sexual harassment on students

సూర్యాపేట: విద్యార్థినిలను  లైంగికంగా వేధించిన ప్రధానోపాధ్యాయుడుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అనిల్ కుమార్ అనే వ్యక్తి చింతలపాలెం మండలం కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇద్దరు బాలికలకు గుంతలు కట్టి ఓ గదిలోకి తీసుకెళ్లి వారి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆరోజు నుంచి స్కూల్ వెళ్లమంటే సదరు విద్యార్థినులు భయంతో వణికిపోతున్నారు. తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి రావడంతో ప్రధానోపాధ్యాయుడిని స్థానికులు నిలదీశారు. వెంటనే గ్రామస్థులు ప్రధానోపాధ్యాయుడిపై దాడి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News