- Advertisement -
చెన్నై: కారు ఢీకొట్టడంతో ఎస్ఐ మృతి చెందిన సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని మెరీనా బీచ్కు సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రసన్న అనే యువకుడు (26) డిజిపి కార్యాలయంలో టెక్సికల్ విభాగంలో ఎస్ఐగా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి డ్యూటీ అయిపోయిన తరువాత రోడ్డును దాటుతుండగా కారు ఢీకొట్టడడంతో ఎస్ఐ ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందాడు. ఎస్ఐని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందారని తెలిపారు. అన్నా స్కయర్ పోలీసులు కేసు నమోదు చేసి కారు డ్రైవర్ రాజ్కుమార్ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఎస్ఐ స్వస్థలం విల్లుపురం జిల్లా కోవిలూర్ ప్రాంతానికి చెందినవాడు.
- Advertisement -