Friday, April 19, 2024

ఆత్మకూరు(ఎస్) లాకప్ హింస ఘటనలో ఎస్‌ఐ సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

SI suspension in Atmakuru (S) lockup violence incident

ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇటీవల సూర్య నటించిన జై భీమ్ సినిమా తరహాలో ఓ దొంగతనం కేసులో విచారణ పేరిట గిరిజన యువకుడిని చితకబాది విమర్శల పాలైన ఎస్‌ఐ లింగంను సస్పెండ్ చేస్తూ ఎస్‌పి రాజేంద్రప్రసాద్ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఆత్మకూరు మండలం ఏపూరు గ్రామ మద్యం దుకాణంలో చోటుచేసుకున్న చోరీ ఘటనలో సీసీ కెమెరాల ఆధారంగా నలుగురు యువకులను ఆత్మకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో వీరశేఖర్ అనే వ్యక్తి పట్ల దారుణంగా వ్యవహరించిన ఖాకీలు అభాసుపాలయ్యారు. తీవ్రంగా హింసించడంతో యువకుడి గ్రామస్థులైన రామోజీతండా వాసులు ఆందోళన నిర్వహించారు. గిరిజన యువకుడిపై దాడి అంశంలో అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో… సూర్యాపేట డిఎస్‌పి విచారణాధికారిగా నియమించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News