Thursday, April 18, 2024

ధర్మపురిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలపై సమావేశం

- Advertisement -
- Advertisement -

జగిత్యాల : ధర్మపురిలో ఫిబ్రవరి 16 నుంచి జరగనున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల జాతర ఏర్పాట్లపై మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యస్మిన్ భాషాలు పాల్గొన్నారు. జాతరలో పాల్గొనే భక్తుల సౌకర్యాలపై ప్రజాప్రతినిధులతో, ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో ఈ భేటీలో చర్చించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ మందమకరం, జిల్లా ఎస్పీ భాస్కర్, ఆర్డిఓ మాధురి, డిఎస్పి ప్రకాష్, ఎమ్మార్వో వెంకటేష్, ఆలయ ఇఓ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News