హైదరాబాద్: సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరుగుతున్న ఐపిఎల్ 37వ మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన కోల్కతా కెప్టెన్ గౌతమ్ గంభీర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. హైదరాబాద్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. హూడా, నేహ్రాల స్థానంలో సిరాజ్, బిపుల్ శర్మలను తీసుకుంది. కోల్కతా జట్టు మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.