Saturday, April 20, 2024

నేటి నుంచి టెట్ దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు
చెల్లింపునకు అవకాశం మే 20 నుంచి
15రోజుల పాటు పరీక్షలు ఫీజు పెంపును
వ్యతిరేకిస్తున్న దరఖాస్తుదారులు

మే 20 నుంచి 15 రోజుల పాటు పరీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షకు బుధవారం ( మార్చి 27) నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకూ ఆన్‌లైన్ విధానంలో ఫీజు చెల్లించి, దరఖాస్తు చేసుకోవచ్చు. బి.ఇడ్, డి.ఇడి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హులు. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్ష జరుగనుంది. ఉదయం 9నుంచి 11.30 వరకు పేపర్ 1, తిరిగి మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుంది. మే 15వ తేదీన హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టెట్ ఫలితాలను జూన్ 12వ తేదీన విడుదల చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ఉపాధ్యాయ నియామకాలలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తు ఫీజులను విద్యాశాఖ భారీగా పెంచింది. టెట్ -2024 కోసం ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. గతంలో ఒక పేపర్ రాస్తే రూ.200 రుసుము ఉండగా దాన్ని రూ.వెయ్యికి పెంచింది. రెండు పేపర్లు రాస్తే గతంలో రూ.300 రుసుము ఉండగా దాన్ని రూ.2,000 కు పెంపుదల చేసింది. అభ్యర్థులు పేపర్- 1, పేపర్- 2లలో ఏదేని ఒక పరీక్ష రాస్తే రూ.వెయ్యి, రెండు పేపర్లూ రాస్తే రూ.రెండు వేలు చెల్లించాల్సి ఉంటుంది. టెట్ పరీక్షను 11జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని విద్యాశాఖ తెలిపింది.బి.ఇడ్, డి.ఇడి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హులు. సర్వీస్‌లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఈ టెట్‌కు హాజరయ్యే వెసులుబాటు కల్పిస్తున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News